CM Jagan Kodikatti Case: సీఎం జగన్ కోడికత్తి కేసులో బిగ్​ ట్విస్ట్.. విచారణ విశాఖ ఎన్​ఐఏ కోర్టుకు బదిలీ

By

Published : Aug 1, 2023, 5:50 PM IST

thumbnail

CM Jagan Kodikatti Case: సీఎం జగన్ కోడికత్తి కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనిపై విచారణ చేపట్టిన విజయవాడ ఎన్​ఐఏ కోర్టు.. ఈ కేసును విశాఖ ఎన్​ఐఏ కోర్టుకు బదిలీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ కేసు విచారణ విశాఖ ఎన్​ఐఏ కోర్టు చేపడుతుందని న్యాయమూర్తి వెల్లడించారు. తదుపరి విచారణను ఈ నెల 8వ తేదీకి వాయిదా వేసింది.  అయితే ఈ కేసులో 80 శాతం వరకు విచారణ ఇప్పటికే పూర్తయిందని, ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి సీఎం జగన్ కోర్టుకు హాజరై సాక్ష్యం చెబితేనే కేసు ముందుకు సాగుతుందని నిందితుడి తరఫు న్యాయవాది పేర్కొన్నారు. లేనిపక్షంలో ఈ కేసు విచారణ మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. విజయవాడ ఎన్​ఐఏ కోర్టు తీసుకున్న నిర్ణయంతో ఈ కేసు మరలా మొదటికి వచ్చే పరిస్థితి ఏర్పడిందని నిందితుడు శ్రీనివాసరావు తరఫు న్యాయవాది వాపోయారు. విజయవాడ కోర్టు తీసుకున్న నిర్ణయంతో కేసు ఇంకెన్ని రోజులు సాగుతుందోనని అంటున్న నిందితుడు శ్రీనివాసరావు తరఫు న్యాయవాది గగన సింధుతో మా ప్రతినిధి ముఖాముఖి..

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.