Bus Falls From Flyover Viral Video : ఫ్లైఓవర్​పై​ నుంచి కిందపడ్డ RTC బస్సు.. ఆస్పత్రిలో 20మంది.. డ్రైవర్​ నిద్రమత్తే కారణం!

By ETV Bharat Telugu Team

Published : Sep 14, 2023, 9:23 PM IST

Updated : Sep 14, 2023, 10:07 PM IST

thumbnail

Bus Falls From Flyover Viral Video : ఉత్తర్​ప్రదేశ్​.. గాజియాబాద్​ జిల్లాలో అదుపు తప్పిన ఆర్​టీసీ బస్సు ఫ్లైఓవర్​ పైనుంచి కింద పడింది. దిల్లీ-మేరఠ్ ఎక్స్​ప్రెస్​వేపై జరిగిన ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.  

ఇదీ జరిగింది.. దిల్లీ-ఎక్స్​ప్రెస్​వేపై ఆర్​టీసీ బస్సు వెళ్తోంది. ఈ క్రమంలో బస్సు హవా హవారీ రెస్టారెంట్​​ సమీపంలోకి రాగానే అదుపు తప్పింది. అనంతరం అదుపు తప్పిన బస్సు.. నేరుగా రోడ్డు పక్కన డివైడర్​ను ఢీకొట్టింది. వెంటనే ఫ్లైఓవర్​ పై నుంచి కింద ఉన్న పొలంలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. గాయపడిన వారిని అంబులెన్స్​ల ద్వారా ఆస్పత్రికి తరలించామని ఏసీపీ నరేశ్​ కుమార్ వెల్లడించారు.  
పొలంలో పడే ముందు బస్సు.. స్తంభాన్ని ఢీకొట్టిందని క్షతగాత్రుడు మహ్మద్​ సాధిక్ తెలిపాడు. అయితే నిద్ర మత్తులో డ్రైవర్ ఉన్నాడని కొందరు ప్రయాణికులు తెలిపారు. కానీ ఈ ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియలేదు.  

Last Updated : Sep 14, 2023, 10:07 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.