అధికారంలోకి వచ్చాక కేసీఆర్​ కుటుంబ ఆస్తులను స్వాధీనం చేసుకుంటాం​ : బండి సంజయ్​

By ETV Bharat Telangana Team

Published : Nov 5, 2023, 3:02 PM IST

thumbnail

Bandi Sanjay Fires on BRS and Congress : బీఆర్​ఎస్​, కాంగ్రెస్​పార్టీలు​ బీసీలను అవమానిస్తున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్​ మండిపడ్డారు. రాష్ట్రంలోని బీసీలకు ఇరు పార్టీలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర జనాభాలో అధిక భాగం ఉన్న.. బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని ఎందుకు చేయరని ప్రశ్నించారు. బీసీ ప్రజలంతా కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ పార్టీలను నిలదీయాలని కోరారు.  

Bandi Sanjay Respond on Medigadda Barrage Report : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై.. ముఖ్యమంత్రి కేసీఆర్​ ఎందుకు స్పందించడం లేదని బండి సంజయ్​ ప్రశ్నించారు. ఇప్పటి వరకు మేడిగడ్డను పరిశీలించలేదని విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీ పియర్​ల కుంగుబాటుపై.. జాతీయ డ్యాం సేఫ్టీ బృందం ఇచ్చిన నివేదిక తప్పని ఎలా అంటారని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కేసీఆర్​ కుటుంబ ఆస్తులను స్వాధీనం చేసుకుంటామన్నారు. కాళేశ్వరంపై చర్చిండానికి.. సీఎం కేసీఆర్​ను ఆహ్వానిస్తున్నాని సవాల్​ విసిరారు. రాష్ట్రంలో కాంగ్రెస్​పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. రేవంత్​రెడ్డిని సీఎం చేయకపోతే.. కాంగ్రెస్​ పార్టీకి మద్ధతిస్తామని ముస్లిం నేతలు రాహుల్​ గాంధీకి చెప్పారన్నారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.