Actor Prabhas visit Tirupathi శ్రీవారి సేవలో హీరో ప్రభాస్.. నేడు తిరుపతిలో 'ఆదిపురుష్​' ప్రీ రీలీజ్ ఈవెంట్​

By

Published : Jun 6, 2023, 9:10 AM IST

thumbnail

Prabhas Visits Tirumala: తిరుమల శ్రీవారిని సినీ నటుడు ప్రభాస్ దర్శించుకున్నారు. తిరుపతిలో నిర్వహించనున్న ఆదిపురుష్​ చిత్రం ప్రీ రిలీజ్​ ఈవెంట్​ సందర్భంగా సోమవారం రాత్రి ప్రభాస్​ తిరుపతికి చేరుకున్నారు. అయితే శ్రీవారి దర్శనం కోసం మంగళవారం ఉదయమే తిరుమలకు చేరుకున్న ఆయనకు... తితిదే అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం దర్శన ఏర్పాట్లు చేశారు. నటుడు ప్రభాస్​ శాస్త్రోక్తంగా తిరుమల శ్రీవారి సుప్రభాత సేవ, స్వామి వారి సేవలో పాల్గొన్నారు. గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్న ప్రభాస్​ మొక్కులు చెల్లించుకున్నారు. ఆయనకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. తిరుమలలో స్వామి వారి దర్శన సమయంలో ప్రభాస్​ను గమనించిన ఫ్యాన్స్​ .. తమ అభిమాన నటుడికి అభివాదం చేశారు. ఉత్సాహవంతమైన అభిమానుల కేరింతలతో ఆలయం ప్రాంగణంలో సందడి నెలకొంది. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో ఆదిపురుష్​ ప్రీ రీలీజ్​ ఈవెంట్​ సాయంత్రం 5గంటల నుంచి జరుగుతుందని చిత్ర యూనిట్​ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. రామాయణ ఇతివృత్తం ఆధారంగా నిర్మిస్తున్న ఆదిపురుష్​ చిత్రంలో ప్రభాస్​ రాముడిగా నటిస్తుండగా.. సీత పాత్రలో కృతి సనన్​ నటిస్తోంది. ఈ నెల 16 వ తేదీన ఈ చిత్రం విడుదల కాబోతుంది.    

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.