జాతీయ రహదారిపై భారీగా విరిగిపడిన కొండచరియలు

By

Published : Aug 10, 2021, 12:03 PM IST

thumbnail

ఉత్తరాఖండ్​లోని తోతా ఘాటి వద్ద రిషికేశ్​-శ్రీనగర్​ను కలిపే 58వ జాతీయ రహదారిపై ఉన్నట్లు ఉండి ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఫలితంగా రహదారి మూసుకుపోయి.. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంతకుముందే జారీ చేసిన ప్రమాద హెచ్చరికలతో వాహనాలను నిలిపేయడం వల్ల పెను ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన దృశ్యాలను స్థానికులు తమ ఫోనుల్లో రికార్డు చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.