ప్రైవేట్​ బస్సులో మంటలు.. త్రుటిలో తప్పిన ప్రమాదం

By

Published : Sep 3, 2020, 10:06 AM IST

thumbnail

కర్ణాటక బీదర్​ జిల్లాలోని హుమ్నాబాద్​ సమీపంలో బుధవారం రాత్రి ఓ ప్రైవేట్​ బస్సులో మంటలు చెలరేగాయి. ప్రయాణ సమయంలో బస్సులో 17 మంది ప్రయాణికులు ఉండగా.. త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఇంజిన్​ నుంచి మంటలు వ్యాపించడాన్ని పసిగట్టిన డ్రైవర్.. తక్షణమే బస్సు దిగాలని ప్రయాణికుల్ని అప్రమత్తం చేశాడు. అంతకంతకూ విస్తరించిన మంటలు.. క్షణాల వ్యవధిలోనే తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెంది, బస్సును దగ్ధం చేశాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.