తమిళనాడులో పొంగల్ సందర్భంగా నిర్వహించే జల్లికట్టు సంబరాలు ప్రారంభమయ్యాయి. బసవన్నలను అదుపు చేసేందుకు క్రీడాకారులు ఉత్సాహం చూపిస్తున్నారు. శుక్రవారం మదురై జిల్లాలోని అవనియపురంలో జరిగిన జల్లికట్టు పోటీలు ఆకట్టుకున్నాయి. కరోనా నిబంధనలకు పాటిస్తూ.. పరిమిత సంఖ్యలో ఔత్సాహికులను అనుమతించారు నిర్వాహకులు.