ముంచెత్తిన వరదలు- స్తంభించిన జనజీవనం

By

Published : Jul 18, 2021, 1:27 PM IST

thumbnail

మహారాష్ట్ర ముంబయి నగరంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలు కాలనీల్లోకి వరద నీరు ప్రవేశించింది. చాలా చోట్ల రాకపోకలు స్తంభించిపోయాయి. చెంబుర్, విక్రోలి​లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 25 మంది మృతి చెందారు. వర్షాల కారణంగా ముంబయిలోని చాలా ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. వర్షాల కారణంగా సోమవారం ముంబయి సబర్బన్​ రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.