'సీఎం గారూ.. ధైర్యముంటే నాపై పోటీ చేయండి!'

By

Published : May 12, 2022, 2:35 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

thumbnail

MP Navneet Rana dares Uddhav: మే​ 14న దిల్లీలోని కన్నాట్​ ప్లేస్​లో ఉన్న​ ఆలయంలో హనుమాన్​ చాలీసా పారాయణం చేస్తామన్నారు మహారాష్ట్ర అమరావతి ఎంపీ నవనీత్​ రాణా. హనుమాన్​ చాలీసా వివాదంలో అరెస్టై ఇటీవలే జైలు నుంచి విడుదలైన ఎంపీ.. ఈటీవీ భారత్​ ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడారు. రాష్ట్రంలో జరిగింది దురదృష్టకరమని, బ్రిటిషనర్ల నాటి సెక్షన్​ 24ఏ ను దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. దేశద్రోహ చట్టం ఇంకా అమలులో ఉందంటే గత ప్రభుత్వాల అసమర్థతేనన్నారు. సుప్రీం కోర్టు ఆ చట్టం అమలుపై స్టే విధించటాన్ని స్వాగతించారు. ప్రధాని మోదీ ఎల్లప్పుడు దేశాభివృద్ధి కోసమే పాటుపడతారని, అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపుతారన్నారు. 'నా విషయంలో ఉద్ధవ్​ ఠాక్రే దిగజారిపోయారు. నా స్వేచ్ఛను అణచివేశారు. చిల్లర రాజకీయాలు మాని నిర్మాణాత్మక పనులపై దృష్టిపెట్టాలని సూచిస్తున్నా. 50 మంది ఎమ్మెల్యేలు, 18 మంది ఎంపీలు ఉన్న అధికార పార్టీ ఒక ఎంపీతో పోరాటం చేస్తోంది. బాలసాహెబ్​ ఠాక్రే ప్రజల కోసం పని చేశారు. అధికారం కోసం కాదు. దానికి విరుద్ధంగా ఉద్ధవ్​ ఠాక్రే పని చేస్తున్నారు. ఆయనకు ధైర్యం ఉంటే రాష్ట్రంలోని ఏ నియోజకవర్గం నుంచైనా నాపై పోటీ చేయాలి' అని సవాలు విసిరారు నవనీత్.

Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.