దళితుడి మెడలో చెప్పుల దండ వేసి దారుణంగా కొట్టిన యువకులు

By

Published : Nov 26, 2022, 4:55 PM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

thumbnail

రాజస్థాన్​లో దారుణం వెలుగుచూసింది. కొందరు యువకులు ఓ దళితుడిని ఘోరంగా అవమానించారు. సిరోహి జిల్లాలోని మాండ్వా హైవేపై ఉన్న రాజ్​వాడీ దాబా దగ్గర ఈ ఘటన జరిగింది. బాధితుడు ఆ దాబాలో లైట్​లు బింగించే పని చేసి డబ్బులు అడగడానికి వెళ్లాడు. అయితే అక్కడ ఉన్న ప్రవీణ్ చౌహాన్, సురేంద్ర సింగ్ సోదా, ములారం భట్ అతడిని కొట్టి, మెడలో చెప్పుల దండ వేసి దుషించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్​మీడియాలో వైరల్​గా మారింది. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.