ప్రధాని మోదీ మీటింగ్​లో పాము కలకలం భయంతో కుర్చీలెక్కిన ప్రజలు

By

Published : Nov 21, 2022, 7:20 PM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

thumbnail

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీటింగ్​లో ఓ పాము కలకలం సృష్టించింది. గుజరాత్​ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం భరూచ్​లోని జంబుసర్​ ప్రాంతంలో​ ప్రధాని నరేంద్ర మోదీ ఓ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్​లో ముందు వరుసలో కూర్చున్న వారికి ఓ పాము కనిపించింది. దీంతో సభా ప్రాంగణంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. కొందరు భయంతో కుర్చీలపైకి ఎక్కి నిల్చున్నారు. ప్రధాని సభా ప్రాంగణానికి రాకముందే ఈ గందరగోళం జరిగింది. అక్కడే ఉన్న ఓ పోలీసు ధైర్యం చేసి పామును పట్టుకున్నారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం మోదీ మీటింగ్​కు​ హాజరై ప్రసంగించారు.

Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.