గుర్రంపై అసెంబ్లీకి మహిళా ఎమ్మెల్యే
Women's Day 2022: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాంచీలోని శాసనసభకు గుర్రంపై వచ్చారు ఝార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అంబా ప్రసాద్. "ప్రతి మహిళలోనూ దుర్గా దేవి, ఝాన్సీ రాణి ఉంటుంది. సవాళ్లన్నింటినీ మహిళలు పూర్తి శక్తిసామర్థ్యాలతో ఎదుర్కోవాలి" అనే సందేశం ఇచ్చేందుకు ఇలా చేసినట్లు వెల్లడించారు. మహిళలు ప్రతి రంగంలోనూ రాణిస్తున్నారని, తల్లిదండ్రులు బాలికలు అందరినీ చదివించి, ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు అంబా ప్రసాద్.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST