ETV Bharat / t20-world-cup-2022

'కింగ్' కోహ్లీ సూపర్ ఇన్నింగ్స్.. ఉత్కంఠ పోరులో భారత్​ విజయం

author img

By

Published : Oct 23, 2022, 5:25 PM IST

Updated : Oct 23, 2022, 6:00 PM IST

india pakistan match  t20 world cup 2022
india pakistan match t20 world cup 2022

India vs Pakistan : ఉత్కంఠ భరితమైపోరులో భారత్​ విజయం సాధించింది. పాకిస్థాన్​పై 4 వికెట్ల తేడాతో గెలిచింది. కింగ్ కోహ్లీ, హార్దిక్​ పాండ్య అద్భత చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడారు.

India vs Pakistan : పాకిస్థాన్​పై టీమ్ ఇండియా అద్భుత విజయం సాధించింది. దాయాదుల మధ్య చివరి బంతి వరకూ సాగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో భారత్‌ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. అన్ని విభాగాల్లో రాణించి చిరకాల ప్రత్యర్థిపై విజయాల పరంపర కొనసాగించింది. మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ (82*) ఒంటి చేత్తో టీమ్‌ఇండియాను గెలిపించాడు. 31 పరుగులకే 4వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన టీమ్‌ఇండియాను విరాట్‌ కోహ్లీ-హార్దిక్‌ పాండ్య ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు శతక భాగస్వామ్యం జోడించారు. ఆ తర్వాత పాండ్య ఔటవగా.. కోహ్లీ చివరి వరకూ క్రీజ్‌లో ఉండి జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో టీమ్‌ఇండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి ఓవర్లలో ఒత్తిడి కారణంగా పాకిస్థాన్‌ చేసిన తప్పిదాలు టీమ్‌ఇండియాకు వరంలా మారాయి. పాక్​ బౌలర్లు హరిస్ రవుఫ్(2), నసీం షా(1) నవాజ్​(2) వికెట్లు తీశారు.

మొదట టాస్​ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్​.. పవర్​ ప్లేలో పాకిస్థాన్​ను కట్టిడి చేసింది. ఆ తర్వాత భారత బౌలర్ల ధాటికి పాక్​ నిలబడలేక పోయింది. ఆ తర్వాత పుంజుకున్న పాక్​.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఈ మ్యాచ్​తో వరల్డ్​ కప్​​లో మొదటి సారి ఆడుతున్న టీమ్ ఇండియా యువ బౌలర్ అర్షదీప్ సింగ్ అద్భుత ప్రదర్శన చేశాడు. 32 పరుగులు సమర్పించి 3 వికెట్లు పడగొట్టాడు. హార్దిక్​ పాండ్యా(3) వికెట్లతో అద్భుత ప్రదర్శన చేశాడు. మొత్తం నాలుగు ఓవర్లు వేసిన హార్దిక్.. 20 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. షమీ, భువనేశ్వర్ చెరో ఒక వికెట్​ పడగొట్టారు. ఒక పరుగుకే.. మొదటి వికెట్ కోల్పోయింది. ఓపెనర్​ బాబర్​ అజామ్​(0)ను పెవిలియన్ పంపించింది టీమ్ ఇండియా. నాలుగో ఓవర్లో 15 పరుగుల వద్ద మరో కీలక బ్యాటర్ మహ్మద్​ రిజ్వాన్​(4) అర్ష్​దీప్​ సింగ్ బౌలింగ్​లో క్యాచ్​ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్​కు దిగిన షాన్​ మసూద్​, ఇఫ్తికార్ అహ్మద్​(51) చెలరేగిపోయి ఆడారు. మరో బ్యాటర్ షాన్​(52) పరుగులు చేసి నాటౌట్​గా నిలిచాడు.

అక్షర్​ పటేల్​ వేసిన 12వ ఓవర్లో ఇఫ్తికార్​ అహ్మద్​ మూడు సిక్స్​లతో చెలరేగిపోయాడు. అనంతరం మహ్మద్​ షమీ బౌలింగ్​లో ఎల్​బీడబ్ల్యూ అయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన సాహబ్​ ఖాన్(5), హైదర్ అలీ(2), మహ్మద్​ నవాజ్​(9) పేలవ ప్రదర్శన చేశారు. అర్ష్​దీప్ సింగ్ బౌలింగ్​లో అసిఫ్ అలీ (2) షాట్​కు ప్రయత్నించగా.. బంతి నేరుగా దినేశ్​ కార్తిక్​ చేతిలోకి వెళ్లింది. దీంతో పాకిస్థాన్​ 120 పరుగుల వద్ద ఏడో వికెట్​ కోల్పోయింది. ఆ తర్వాత షహీన్ అఫ్రిది(16) పరుగులు చేసి భువనేశ్వర్ బౌలింగ్​లో ఔట్ అయ్యాడు.

ఇవీ చదవండి : T20 World Cup : పాక్​కు స్లో స్టార్ట్​.. అభిమానులతో హోరెత్తిన స్టేడియం

T20 World Cup 2022 అతి పిన్న, పెద్ద వయసు ఆటగాళ్లు వీరే

Last Updated :Oct 23, 2022, 6:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.