ETV Bharat / state

యాదాద్రిలో ఈనెల 19వరకు దర్శనాలు నిలిపివేత

author img

By

Published : Jun 12, 2021, 11:44 AM IST

 Yadadri temple closed for till this month 19th
Yadadri temple closed for till this month 19th

యాదాద్రిలో ఈనెల 19వరకు దర్శనాలు నిలిపివేసినట్లు అధికారులు పేర్కొన్నారు. లాక్​డౌన్​ సడలింపు సమయం ఉదయం 6నుంచి సాయంత్రం 5వరకు ఉండటంతో భక్తులు వైకుంఠద్వారం వద్ద తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు లాక్​డౌన్​ కొనసాగుతున్న నేపథ్యంలో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనాలను నిలిపివేశారు. కొవిడ్​ నియంత్రణలో భాగంగా ఈనెల 19 వరకు ఆలయంలోకి భక్తులను అనుమతించడం లేదని అధికారులు తెలిపారు. దర్శనాలు, ఆర్జిత సేవలు నిలిపివేశారు.

బాలాలయంలో స్వామివారికి ఏకాంతంగా పూజలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో లాక్​డౌన్​ సడలింపు సమయం ఉదయం 6నుంచి సాయంత్రం 5వరకు ఉండటంతో భక్తులు వైకుంఠద్వారం వద్ద తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు.

ఇదీ చూడండి: CM KCR: 19 నుంచి పల్లె, పట్టణప్రగతి పనుల ఆకస్మిక తనిఖీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.