ETV Bharat / state

కన్నుల పండువగా లక్ష పుష్పార్చన మహోత్సవం

author img

By

Published : Dec 11, 2020, 5:38 PM IST

యాదాద్రి ఆలయంలో లక్ష పుష్పార్చన మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారికి నిత్య కల్యాణం, సుదర్శన నారసింహ హోమం, అభిషేకం, అర్చన తదితర పూజలు నిర్వహించారు.

కన్నుల పండువగా లక్ష పుష్పార్చన మహోత్సవం
కన్నుల పండువగా లక్ష పుష్పార్చన మహోత్సవం

యాదాద్రి ఆలయంలో లక్ష పుష్పార్చన మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. బాలాలయ మండపంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు లక్ష పుష్పార్చన నిర్వహించారు. శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి నాడు.. పూలతో అర్చన నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

యాదాద్రికి తరలివచ్చిన భక్తులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ, నిత్య కల్యాణం, సుదర్శన నారసింహ హోమం, అభిషేకం, అర్చన తదితర పూజల్లో పాల్గొన్నారు.

ఇవీ చూడండి: దేశంలో ఏమైనా ఆర్థిక ఎమర్జెన్సీ ఉందా: ఏపీ హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.