ETV Bharat / state

యాదాద్రిలో వైభవంగా నిత్యపూజలు.. అమ్మవారికి శాస్త్రోక్తంగా ఊంజల్​ సేవ

author img

By

Published : Oct 9, 2020, 10:58 PM IST

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహుని బాలాలయంలో శుక్రవారం సాయంత్రం ఊంజల్‌ సేవను కోలాహలంగా నిర్వహించారు. ఆండాళ్​ అమ్మవారికి విశేష పుష్పాలతో అలంకారం జరిపారు. ఆలయ అర్చకులు, అర్చక స్వాములు ఊంజల్ సేవలో కొలువై ఉన్న ఆండాళ్ అమ్మవారికి హారతినిస్తూ కీర్తన చేశారు.

unjal seva rituals in yadadri temple
యాదాద్రిలో వైభవంగా నిత్యపూజలు.. అమ్మవారికి శాస్త్రోక్తంగా ఊంజల్​ సేవ

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో నిత్య పూజలు ఆగమ శాస్త్ర ప్రకారం జరిగాయి. ఉదయం సుప్రభాత సేవతో అర్చకులు పూజలు ప్రారంభించారు. బాలాలయంలో ప్రతిష్టామూర్తులను పంచామృతాలతో అభిషేకించారు. తులసీ పత్రాలతో అర్చన చేశారు. బాలాలయం మండపంలో శ్రీ సుదర్శన నారసింహ హోమం, విశ్వక్సేన ఆరాధనతో నిత్య కల్యాణాలు వైభవంగా కొనసాగాయి.

వైభవంగా ఊంజల్​ సేవ

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో శుక్రవారం స్వామి, అమ్మవార్లకు నిత్య కైంకర్యాలు, అమ్మవారికి ఊంజల్ సేవా పర్వాలను అర్చకులు శాస్త్రోక్తంగా చేపట్టారు. సాయంత్రం బాలాలయంలో ఆండాళ్ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ఊంజల్ సేవ నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేక అలంకరణ చేశారు. వివిధ రకాల పూలతో, తులసీ దళాలతో పూజలు చేపట్టారు. ఆలయ అర్చకులు, అర్చక స్వాములు ఊంజల్ సేవలో కొలువై ఉన్న ఆండాళ్ అమ్మవారికి హారతినిస్తూ కీర్తన చేశారు.

వేద మంత్రోచ్ఛరణల మధ్య మంగళవాయిద్యాల నడుమ అమ్మవారికి ఊంజల్ సేవా మహోత్సవం కోలాహలంగా నిర్వహించారు. మొదటగా శ్రీ మన్యు సూక్త పారాయణం జరిపారు. ప్రత్యేకంగా బంగారంతో తయారుచేసిన 108 పుష్పాలను శ్రీవారి సన్నిధిలో ఉంచి వాటితో అర్చన జరిపారు. తిరువీధి సేవ అనంతరం అమ్మవారిని బాలాలయంలో ముఖమండపంలోని ఉయ్యాలలో శయనింపు చేయించారు.

గంట పాటు వివిధ రకాల పాటలతో అమ్మవారిని కొనియాడుతూ, లాలి పాటల కోలాహలం కొనసాగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి స్వామి వారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.



ఇవీ చూడండి: 'విద్యను మాతృభాషలో ఇస్తే.. అవగాహన శక్తి పెరుగుతుంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.