ETV Bharat / state

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి సేవలో మంత్రి సత్యవతి

author img

By

Published : Mar 5, 2020, 2:04 PM IST

తిరుమల తిరుపతి దేవస్థానానికి దీటుగా రాష్ట్రంలో యాదగిరిగుట్టను నిర్మించిన ఘనత కేసీఆర్​కే చెందుతుందని గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్​ అన్నారు. ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్​ రెడ్డితో కలిసి ఆమె​ యాదాద్రీశుని సేవలో పాల్గొన్నారు.

minister satyavathin rathod visit yadadri lakshmi narasimha swami temple in yadadri bhuvanagiri
యాదాద్రి లక్ష్మినరసింహ స్వామి సేవలో మంత్రి సత్యవతి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రీశుని బ్రహ్మోత్సవాల్లో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్​ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆమెతో పాటు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్​ శ్రీమతి గొంగిడి సునీత మహేందర్​ రెడ్డి హాజరయ్యారు.

అనంతరం మహిళల భద్రత-షీ టీమ్స్​పై రాచకొండ పోలీస్​ కమిషనరేట్​ ఆధ్వర్యంలో భువనగిరిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని ఎమ్మెల్యే సునీతతో కలిసి దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి సత్యవతి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవ్వరికీ సాధ్యంకాని పనులను సుసాధ్యం చేయడంలో దిట్ట అని పేర్కొన్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానానికి దీటుగా యాదగిరిగుట్ట ఆలయాన్ని నిర్మింపజేశారని వెల్లడించారు. యాదాద్రిని చూస్తే తెలంగాణ రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో అర్థం అవుతుందని తెలిపారు.

యాదాద్రి లక్ష్మినరసింహ స్వామి సేవలో మంత్రి సత్యవతి

ఇదీ చూడండి: వైభవంగా యాదాద్రీశుడి కల్యాణం.. నేడు రథోత్సవం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.