ETV Bharat / state

యాదాద్రి భువనగిరిలో కట్టుదిట్టంగా లాక్​డౌన్​

author img

By

Published : May 12, 2021, 1:55 PM IST

lockdown strictly execute in yadadri district
యాదాద్రి భువనగిరిలో కట్టుదిట్టంగా లాక్డౌన్

యాదాద్రి భువనగిరి జిల్లాలో లాక్​డౌన్​ కట్టుదిట్టంగా అమలవుతోంది. 10 గంటలు దాటిన తర్వాత పోలీసులు అన్ని దుకాణాలను మూసివేయించారు. నిబంధనలు ఉల్లంఘించి బయటకు వస్తున్న వారికి కౌన్సిలింగ్​ ఇస్తున్నారు.

యాదాద్రిభువనగిరి జిల్లా యాదగిరిగుట్ట, తుర్కపల్లి, బొమ్మలరామారం, మోటకొండూర్, ఆలేరు, రాజపేట మండలాల్లో పోలీసులు పకడ్బందీగా లాక్​డౌన్ అమలు చేస్తున్నారు. యాదగిరిగుట్టలో ఉదయం 10 గంటలు దాటగానే పోలీసులు దుకాణాలు మూయించివేశారు. లాక్​డౌన్ అమలులోకి వచ్చినా.. రోడ్లపై తిరుగుతున్న వాహనదారులకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు.

మరోవైపు లాక్​డౌన్ అమలులోకి రాగానే పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో దర్శనాలు నిలిపివేశారు. నేటి నుండి ఈ నెల 21 వరకు స్వామివారి దర్శనాలు రద్దు చేసినట్లు ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. ఆలయంలో నిత్యం నిర్వహించే స్వామివారి నిత్య కల్యాణం, సుదర్శన నారసింహ హోమం అంతరంగికంగా యధావిధిగా కొనసాగుతాయన్నారు.

ఇవీ చదవండి: రాష్ట్రంలో కొనసాగుతున్న కొవిడ్‌ వ్యాక్సినేషన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.