ETV Bharat / state

భువనగిరిలో మా గెలుపు ఖాయం: కోమటిరెడ్డి బ్రదర్స్

author img

By

Published : Apr 1, 2019, 12:41 PM IST

కోమటిరెడ్డి బ్రదర్స్

భువనగిరి కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి ఈరోజు ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్​ గాంధీని కలిశారు. ఈనెల 8న రాష్ట్రంలో మరోసారి ప్రచారం నిర్వహించాలని రాహుల్​ను కోరినట్లు తెలిపారు.

కోమటిరెడ్డి బ్రదర్స్
నేడు రాష్ట్రంలో మూడు సభల్లో పాల్గొనడానికి వచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్​గాంధీనిఈరోజు ఉదయం కోమటిరెడ్డి సోదరులు కలిశారు. ఈనెల 8న మరోసారి ప్రచారం నిర్వహించాలని కోరారు. మల్కాజిగిరి, భువనగిరి, సికింద్రాబాద్​లలో రోడ్​షోలో పాల్గొనాలని కోరగా రాహుల్​ సానుకూలంగా స్పందించారని తెలిపారు. కోమటిరెడ్డి బ్రదర్స్​ను గెలుస్తారా అని రాహుల్​ అడిగినట్లు.. తమ విజయం ఖాయమని ధీమాగా చెప్పినట్లు వెల్లడించారు.

ఇవీ చూడండి:తెలంగాణలో మంత్రులకు లోక్​సభ పరీక్ష...!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.