ETV Bharat / state

'రెండు నెలల్లో పనులు పూర్తి చేయాలి'

author img

By

Published : May 23, 2020, 2:34 PM IST

Yadadri temple construction work  latest news
Yadadri temple construction work latest news

యాదాద్రి ఆలయ నిర్మాణంలోని మిగతా పనులన్నింటిని రెండు నెలల్లో పూర్తిచేయాలని గుత్తేదారులను ఆదేశించినట్లు యాడా వైస్ ఛైర్మన్ కిషన్ రావు తెలిపారు.

యాదాద్రి ఆలయ నిర్మాణంలో ప్రధాన పనులన్నీ పూర్తయ్యాయని యాడా వైస్ ఛైర్మన్ కిషన్ రావు తెలిపారు. మిగతా పనులు, తుది మెరుగులు దిద్దే పర్వాలన్నింటిని రెండు నెలల్లో పూర్తిచేయాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. శుక్రవారం యాదగిరిగుట్టలో ఆలయ పనులన్నింటిని పరిశీలించాక సంబంధిత అధికారులు, గుత్తేదారులతో సమీక్ష చేపట్టారు. ప్రధానాలయంతో పాటు అనుబంధ శివాలయం, మిగతా పనులన్నింటిని గడువులోగా పూర్తిచేయాలని గుత్తేదారులను ఆదేశించారు.

ప్రసాదాల తయారీ విభాగంలో యంత్రాల బిగింపు, ఆలయము, ఆలయ పరిసరాల్లో విద్యుత్ ఏర్పాట్లు సైతం వచ్చే 2నెలల్లో పూర్తియ్యే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సాలాహారాల్లో దేవతామూర్తుల విగ్రహాలను బిగించే పక్రియ త్వరలోనే మొదలు కానుందన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.