వరంగల్లో ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి యత్నించిన ఘటన చోటుచేసుకుంది. కరీమాబాద్కు చెందిన భాస్కర్ అనే వ్యక్తి ఎనిమిదేళ్ల చిన్నారికి మాయమాటలు చెప్పి... ఉర్సు గుట్ట ప్రాంతాన్నికి తీసుకెళ్లాడు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్తున్న క్రమంలో చిన్నారి భయాందోళనకు గురై కేకలు పెట్టింది. అటుగా వెళ్తున్న వ్యక్తులు బాలిక కేకలు విని భాస్కర్ను నిలదీశారు. ఏంచేయాలో పాలుపోని స్థితిలో... భాస్కర్ పొంతన లేని సమాధానాలు చెప్పసాగాడు. అనుమానం వచ్చిన స్థానికులు భాస్కర్ని చితకబాది పోలీసులకు అప్పగించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఇవీ చూడండి: రాజకీయ అరంగేట్రంపై కంగనా ఆసక్తికర సమాధానం