ETV Bharat / state

'ఆ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్​లైన్​లో ఇప్పటిదాకా 6 వేల మంది దరఖాస్తు'

author img

By

Published : Nov 4, 2020, 3:22 PM IST

తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఇప్పటిదాకా 6 వేల మంది ఆన్​లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారని కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి కరుణాకర్​ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 8 సాయంత్రంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగుస్తుందన్నారు. నీట్ ర్యాంక్ కార్డు వచ్చిన ప్రతి విద్యార్థి నమోదు చేసుకొనే అవకాశం ఉందన్నారు.

'ఆ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్​లైన్​లో ఇప్పటిదాకా 6 వేల మంది దరఖాస్తు'
'ఆ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్​లైన్​లో ఇప్పటిదాకా 6 వేల మంది దరఖాస్తు'

రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఇప్పటిదాకా 6 వేల మంది ఆన్​లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారని కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి కరుణాకర్​ రెడ్డి తెలిపారు. ఈ నెల 8 సాయంత్రంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగుస్తుందని.. కరోనా కారణంగా దరఖాస్తు పరిశీలన ప్రక్రియ కూడా ఆన్​లైన్​లోనే నిర్వహిస్తామన్నారు. నీట్ ర్యాంక్ కార్డు వచ్చిన ప్రతి విద్యార్థి నమోదు చేసుకొనే అవకాశం ఉందన్నారు. నీట్​కు ఇచ్చిన డేటాలో అభ్యర్థి ర్యాంక్ మాత్రమే పరిగణలోనికి తీసుకుంటామని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించారు.

విద్యార్థులు తప్పని సరిగా తమ ఓరిజినల్ ధ్రువపత్రాలనే స్కాన్ చేసి దరఖాస్తు చేసుకోవాలని.. దీనికి సంబంధించి అన్ని వివరాలు ప్రాస్పెక్టస్​లో ఉన్నాయని కరుణాకర్​ రెడ్డి తెలిపారు. ఈడబ్ల్యూఎస్​ విద్యార్థులకు సంబంధించి ఏప్రిల్ 2020 తరువాత తీసుకున్న ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుందని.. ఇక ఈ కోటాకు సంబంధించి సీట్ల భర్తీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.

మొత్తం 4,990 ఎంబీబీఎస్ సీట్లలో ప్రభుత్వ కళాశాలలో 1,500 ప్రైవేట్ వైద్య కళాశాలలో 2,750 సీట్లు ఉన్నాయని.. ముస్లిం మైనార్టీ కళాశాలలో 550 సీట్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కొత్తగా మెడికల్, డెంటల్ కళాశాలకు అనుమతి లభించాయన్నారు. కొవిడ్ తీవ్రత తగ్గుముఖం పట్టినా.. ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను అనుసరించి అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు తరగతులు ప్రారంభిస్తామని వర్సిటీ ఉపకులపతి కరుణాకర్​ రెడ్డి వెల్లడించారు.

ఇదీ చదవండి: తెలంగాణ అంటే సకల కళల ఖజానా: మామిడి హరికృష్ణ

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.