ETV Bharat / state

'అమ్మా.. నాన్న నిన్ను చంపాలనుకుంటున్నాడు... మాకు తెలిసిందని..'

author img

By

Published : Apr 11, 2023, 10:21 AM IST

Child Died After Drinking Pesticide
Child Died After Drinking Pesticide

Father tried to Kill daughters in Jangaon : పెళ్లిళ్లు స్వర్గంలోనే నిశ్చయమవుతాయి అంటారు.. కానీ, కలకాలం కలిసుండి ఆ బంధాన్ని బలపరుచుకోవడం, శాశ్వతంగా నిలుపుకోవాల్సిన బాధ్యత మాత్రం ఆ దంపతుల చేతుల్లోనే ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న కాలంలో కొందరు దంపతుల సంసార నావ కొన్నేళ్ల పాటు బాగానే సాగినా.. ఆ తర్వాత పలు కారణాలతో మధ్యలోనే తమ బంధానికి స్వస్తి చెబుతున్నారు. ఇద్దరి మధ్య వ్యక్తిగత విభేదాలు, ఒకరిపై ఒకరికి గౌరవం తగ్గి పోవడం, వివాహేతర సంబంధాలు, వృత్తిపరమైన విభేదాలు రావడం.. ఇలా వైలాహిక బంధం మధ్యలోనే వీగిపోవడానికి కారణాలెన్నో. వారికి వచ్చే చిన్న చిన్న గొడవల్ని భూతద్ధంలో వేసి పెద్దగా చూస్తున్నారు. తాజాగా వరంగల్ జిల్లాలో కుటుంబ కలహాల నేపథ్యంలో తండ్రి తన ఇద్దరి కుమార్తెలకు కూల్​డ్రింక్​లో పురుగుల మందు కలిపి తాగించాడు. ఈ ఘటనలో పెద్ద కుమార్తె మృతి చెందగా, చిన్న కుమార్తె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Father tried to Kill daughters in Jangaon : రాష్ట్రంలో రోజురోజుకి ఆఘాయిత్యాలు పెరిపోతున్నాయే కానీ, తగ్గట్లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా.. కుటుంబ కలహాలు, భార్యభర్తల మధ్య అనుమానాలతో అనేక గొడవలు అవుతున్నాయి. కొంత మంది చిన్న చిన్న మనస్పర్ధలను భూతద్ధంలో చూస్తూ.. వారి సంసార జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఎవరు ఎన్ని చెప్పినా వారి చెప్పిందే చేయాలి, జరగాలని మూర్ఖంగా ప్రవర్తిస్తూ.. తమ జీవితాలనే కాకుండా పిల్లల భవిష్యత్​ను పాడుచేస్తున్నారు.

కొన్నిసార్లు చావడమో.. లేక ఎదుటివాళ్లను చంపడమో చేస్తూ వారి జీవితాన్ని అంధకారం చేసుకోవడమే గాక.. అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవకు పిల్లలు బలయ్యారు. భార్యతో గొడవపడిన భర్త.. ఆమెపై కోపంతో తన కుమార్తెలను చంపడానికి ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో ఒక కుమార్తె మరణించగా.. మరో కూతురు ప్రాణాలతో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది. అసలేం జరిగిందంటే.. ?

స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. జనగామ జిల్లా పాలకుర్తి శివారు జానకిపురం గ్రామానికి చెందిన ధనలక్ష్మీ -శ్రీనివాస్ దంపతులు. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక బాబు ఉన్నారు. పిల్లలు పుట్టేంత వరకూ ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉండేవారు. బాబు పుట్టిన తర్వాత భార్యాభర్తల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. చీటికిమాటికి గొడవపడటం షురూ అయింది. అలా తరచూ ధనలక్ష్మీ, శ్రీనివాస్​లు గొడవపడుతూ ఉండేవారు. ఈ క్రమంలో ఆదివారం రోజు రాత్రి మరోసారి ఈ దంపతులు గొడవపడ్డారు. కోపంతో ధనలక్ష్మీ తన పిల్లలను అక్కడే వదిలేసి పుట్టింటికి వెళ్లింది.

ధనలక్ష్మీ పుట్టింటికి వెళ్లడంతో శ్రీనివాస్ కోపోద్రిక్తుడయ్యాడు. ఎలాగైనా భార్యను తన ఇంటికి రప్పించాలనుకున్నాడు. దానికోసం ఏం చేయాలో అర్థం కాలేదు. చివరకు ఓ దుర్మార్గమైన పథకం రచించాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గత రాత్రి ఇద్దరు కుమార్తెలకు కూల్​డ్రింక్​లో పురుగుల మందు కలిపి తాగించాడు. పిల్లలిద్దరు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో.. భయపడి వారిని వరంగల్​లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ పెద్దు కుమార్తె నందిని మృతి చెందగా.. చిన్నకూతురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

కుటుంబ కలహాల కారణంగా తన భర్త తన పిల్లలపై ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడని ధనలక్ష్మీ అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పెద్ద కుమార్తె మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించారు. అనంతరం నిందితుడు శ్రీనివాస్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

' మాపెద్ద అమ్మాయికి 8 సంవత్సరాలు, చిన్న అమ్నాయికి 6 సంవత్సరాలు. నా భర్తకు నాకు గొడవలు ఎప్పడూ అవుతూనే ఉంటాయి. అయినా నేను పిల్లల కోసం సర్థుకుపోయాను. వాళ్ల కోసమే అన్నీ భరిస్తూ వచ్చాను. పిల్లల ముందు మీ అమ్మని చంపుతానని మందు చూపించి చెప్పాడంటా. అమ్మ నిన్ను నాన్న చంపుతా అన్నాడు. నాన్న ఏం ఇచ్చినా తీసుకోకు అని నాకు చెప్పారు. అది ఆయన విన్నాడు. నా బిడ్డలు నాకు అన్నీ చెబుతున్నారని తెలుసుకున్నాడు. అందుకేనేమో నా బిడ్డలకు పురుగుల మందు ఇచ్చి చంపాలనుకున్నాడు. -మృతురాలి తల్లి, ధనలక్ష్మీ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.