ETV Bharat / state

'సర్పంచ్​పై దాడి హేయమైన చర్య'

author img

By

Published : Sep 16, 2020, 2:46 PM IST

'సర్పంచ్​పై దాడి హేయమైన చర్య'
'సర్పంచ్​పై దాడి హేయమైన చర్య'

వర్ధన్నపేట మండలం కడారిగూడెం గ్రామ సర్పంచ్ మంద సతీశ్​ దాడిపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ బాధ్యులు స్పందించారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న సర్పంచ్​ను ఎస్సీ, ఎస్టీ కమిషన్ మెంబర్ చిలకమర్తి లక్ష్మీనరసింహం పరామర్శించారు.

వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలం కడారిగూడెం గ్రామ సర్పంచ్​పై దాడిని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్​ బాధ్యులు ఖండించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సర్పంచ్​ మంద సతీశ్​ను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్​ మెంబర్​ చిలకమర్తి లక్ష్మీనరసింహం పరామర్శించారు. దాడికి సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

బాధితుడికి న్యాయం జరిగే వరకు న్యాయపోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట వర్ధన్నపేట ఏసీపీ రమేశ్​, సీఐ విశ్వేశ్వర్, ఎస్సై వంశీకృష్ణ ఉన్పారు.

ఇదీ చూడండి: భూ పంచాయితీ విషయంలో తీర్మానానికి వెళ్లిన సర్పంచ్​పై దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.