ETV Bharat / state

వీరి వీరి గుమ్మడి.. కొనేవారేరీ!

author img

By

Published : Apr 30, 2020, 9:13 AM IST

pumpkin farmers problems in selling their crop
వీరి వీరి గుమ్మడి.. కొనేవారేరీ!

లాక్​డౌన్​ వల్ల గుమ్మడికాయలు పండించే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంట విరగ్గాసినా.. దేవాలయాలు మూసివేయడం, శుభకార్యాలు ఆగిపోవడం వల్ల కాయలను కొనేవారు లేకుండా పోయారు.

వరంగల్‌ గ్రామీణ జిల్లా గీసుకొండ మండలం దస్రు తండాకు చెందిన నూనావత్‌ మాన్‌సింగ్‌ అనే రైతు తన మూడెకరాల్లో గుమ్మడి సాగు చేశాడు. పంట విరగ్గాసింది. ఇంతలో లాక్‌డౌన్‌ ప్రకటించడంతో దేవాలయాలు మూతపడ్డాయి. శుభకార్యాలు ఆగిపోయాయి. గుమ్మడి కాయలను కొనేవారు లేకుండా పోయారు. ఏటా తాను నేరుగా హైదరాబాద్‌కు తరలించేవాడినని, ఈసారి రవాణాకు అవకాశం లేక ఇలా 20 టన్నుల పంటను రోడ్డు పక్కనే వదిలేశానని రైతు వాపోయారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.