ETV Bharat / state

ERRABELLI: 'మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం వహిస్తే విధుల నుంచి తొలగిస్తాం'

author img

By

Published : Jun 28, 2021, 4:30 PM IST

Updated : Jun 28, 2021, 4:49 PM IST

పల్లె ప్రగతిలో భాగంగా.. ప్రతీ గ్రామం మొక్కలు నాటడంలో పోటీ పడాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం వహిస్తే విధుల నుంచి తొలగిస్తామని అధికారులను హెచ్చరించారు. రూ. 4 కోట్ల 96 లక్షల నిధులతో మంజూరు చేసిన తారురోడ్డు పనులను చల్లా ధర్మారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.

Panchayati Raj Minister Errabelli Dayakar Rao said that plants should be grown in every village
ERABELLI: ' మొక్కలు పెంచడంలో గ్రామాలు పోటీ పడాలి'

గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ రోజు వరంగల్ గ్రామీణ జిల్లా సంగెం మండలం కాపులకనపర్తి నుంచి సంగెం చేపట్టిన నూతన తారురోడ్డు నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఇందుకు గాను రూ. 4 కోట్ల 96 లక్షల నిధులను ప్రభుత్వం కేటాయించింది.

రాష్ట్రంలో జులై 1 నుంచి ప్రారంభమయ్యే పల్లె ప్రగతిలో భాగంగా ప్రతీ గ్రామం మొక్కలు నాటడంలో పోటీ పడాలని ఎర్రబెల్లి సూచించారు. ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు ఉంటాయన్నారు. మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం వహిస్తే విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. నిధుల కొరత ఏమైనా ఉంటే గ్రామ పంచాయతీల నిధుల నుంచి వాడుకోవాలని అధికారులను ఆదేశించారు.

"త్వరలో ప్రారంభమయ్యే పల్లె ప్రగతిలో ప్రతీ గ్రామం మొక్కలు పెంచటంలో పోటీ పడాలి. ఉత్తమ ప్రతిభ కనపరిచిన 10 గ్రామాలకు బహుమతులు సైతం అందిస్తాం. మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం వహించిన గ్రామ సర్పంచ్​లను, అధికారులను విధుల నుంచి తొలగిస్తాం. ప్రతీ గ్రామంలో చెత్తను ట్రాక్టర్లలో సేకరించేందుకు ఏర్పాటు చేయాలి. ఈ ప్రక్రియ పల్లెల్లో ప్రతి రోజు జరిగేలా చూడాలి. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం ద్వారా రోగాలు రాకుండా కాపాడుకోవచ్చు". - పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

ERRABELLI: 'ప్రతీ గ్రామం మొక్కలు నాటడంలో పోటీ పడాలి'

ఇదీ చూడండి: ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల

Last Updated : Jun 28, 2021, 4:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.