ETV Bharat / state

ఆధార్​ నమోదు కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్​

author img

By

Published : Apr 9, 2021, 5:13 PM IST

Collector Yasmin basha opened the Aadhaar Registration Center
కలెక్టర్​ యాస్మిన్​ భాషా

వనపర్తి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్​ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆధార్ నమోదు కేంద్రాన్ని పాలనాధికారి యాస్మిన్​ బాషా ప్రారంభించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఆధార్ కేంద్రాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్​ యాస్మిన్​ బాషా సూచించారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్​ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆధార్ నమోదు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు.

నూతన ఆధార్ కార్డుల నమోదు, పేరులో మార్పులు, పుట్టిన తేదీ మార్పులు తదితర సమస్యలను ఆధార్ కేంద్రాల ద్వారా పరిష్కరించుకోవాలని కలెక్టర్​ తెలిపారు. నిర్వాహకులు వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సేవలు అందించాలని సూచించారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి వర్షాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.