రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి జిల్లా మంగంపల్లి, గట్ల కానాపురం గ్రామాల్లో పర్యటించారు. మంగంపల్లి చెరువు నుంచి గట్ల కానాపురం చెరువుకు నీటి తరలింపులో భాగంగా మోటార్లను ప్రారంభించారు. అనంతరం గట్ల కానాపురం గ్రామ సమీపంలో నిర్మించనున్న మినీ రిజర్వాయర్ వద్ద పూజలు చేశారు. గతంలో వర్షాలకోసం ఎదురుచూసి వ్యవసాయం చేసుకునే రైతుల కష్టాలు తీరిపోయాయన్నారు. పెద్దమందడి మండలంలో ప్రతి గ్రామానికి కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేఘారెడ్డి, జడ్పీటీసీ రఘుపతి రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి, రాజ ప్రకాష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : జీతాల్లేక పండుగ జరుపుకోవట్లేదు: ఆర్టీసీ కార్మికులు