ETV Bharat / state

పొలం దున్నితే... వెండి నాణేలు ప్రత్యక్షం

author img

By

Published : Apr 2, 2020, 4:19 PM IST

ఓ రైతు తన పొలం చదును చేయిస్తుండగా... వెండి నాణేలు బయపడ్డాయి. వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని పీఏసీఎస్ డైరెక్టర్ పొలంలో లభించిన నాణేలను స్థానికులు తీసుకున్నారు.

141 నాణేలను స్వాధీనం చేసుకున్న పోలీసులు
141 నాణేలను స్వాధీనం చేసుకున్న పోలీసులు

వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలం ఎల్మకన్నెలో గ్రామ సహకార సంఘం డైరెక్టర్‌ వెంకట్రాం రెడ్డి పొలంలో వెండి నాణేలు దర్శనమిచ్చాయి. మూడు రోజుల కిందట తన పొలాన్ని చదును చేయిస్తుండగా వెండి నాణేలు బయటపడ్డాయి. ఆయనతో పాటు ఆ సమయంలో అక్కడ ఉన్న మరికొందరు వాటిని తీసుకెళ్లారు. విషయం బయటికి పొక్కడం వల్ల పోలీసు, రెవెన్యూ అధికారులు బుధవారం పొలం వద్దకు వెళ్లి పరిశీలించారు. అనంతరం 141 వెండి నాణేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇవీ చూడండి : కరోనా పంజా: 12 గంటల్లో 9 మరణాలు, 131 కేసులు

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.