ETV Bharat / state

పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే.. తరలివచ్చిన భక్తులు

author img

By

Published : Dec 17, 2020, 12:45 PM IST

తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తన భార్యతో కలిసి అయ్యప్పస్వామి మహా పడిపూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.

MLA participating in the ayyappa puja Devotees gathered at tandur vikarabad
పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే.. తరలివచ్చిన భక్తులు

పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే.. తరలివచ్చిన భక్తులు

వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అయ్యప్ప మాల స్వీకరించిన నేపథ్యంలో బుధవారం మహా పడిపూజ నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో పూజ భారీ ఎత్తున జరిపారు.

ఈ కార్యక్రమంలో భార్య ఆర్తి రెడ్డితో కలిసి ఆయన పూజలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మహా పడిపూజలో స్వాముల ఆటపాటలతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగింది. శబరిగిరి శివుడిని పూలతో అందంగా అలంకరించారు.

మహోత్సవానికి అయ్యప్ప భక్తులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మహా పడిపూజతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

ఇదీ చూడండి : భార్య కనిపించడం లేదని భర్త హల్​చల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.