ETV Bharat / state

రైతుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం: గాదరి కిషోర్​

author img

By

Published : Jun 10, 2021, 6:41 PM IST

రైతుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్​ అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి, మద్దిరాల, నూతనకల్​, జాజిరెడ్డిగూడెం మండలాల్లో పర్యటించారు.

రైతుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం: గాదరి కిషోర్​
రైతుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం: గాదరి కిషోర్​

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి, మద్దిరాల, నూతనకల్, జాజిరెడ్డిగూడెం మండలాల్లో స్థానిక ఎమ్మెల్యే గాదరి కిషోర్​ పర్యటించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. తుంగతుర్తి, మద్దిరాల, నూతనకల్, మండలాల్లో 195 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు అందించారు.అనంతరం రైతు వేదిక భవనాలను ప్రారంభించారు.

రైతుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని కిషోర్​ అన్నారు. అందుకే రైతు బంధు, రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ ఛైర్​పర్సన్ గుజ్జ దీపికా యుగేందర్, జిల్లా రైతు బంధు కోఆర్డినేటర్ ఎస్ఏ రజాక్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి: నడవలేని స్థితిలో చిరుత.. గేదెల దాడే కారణమని అనుమానం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.