ETV Bharat / state

పోలుమళ్లలో కరోనా కలకలం.. గ్రామస్థునికి పాజిటివ్

author img

By

Published : Apr 22, 2020, 1:20 PM IST

Updated : Apr 22, 2020, 1:27 PM IST

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం పోలుమళ్లలో కరోనా కలకలం రేగింది. గ్రామంలో వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేపట్టారు.

Corona alert in polumalla
పోలుమళ్లలో కరోనా కలవరం

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం పోలుమళ్లలో కరోనా కలకలం రేగింది. జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ వద్ద కిరాణా షాప్ యజమానికి కరోనా నిర్ధరణ కాగా.. షాపులో పనిచేస్తున్న వ్యక్తిని హోం క్వారంటైన్​లో ఉండమని అధికారులు సూచించారు. కానీ సదరు వ్వక్తి ఈనెల 10న మద్దిరాల మండలం పోలుమళ్లకు కాలి నడకన చేరుకొని సాధారణ జీవితాన్ని గడుపుతున్నాడు.

షాపు యజమాని ఇచ్చిన వివరాల ప్రకారం 16న పోలుమళ్లకు చేరుకున్న వ్వక్తిని క్వారంటైన్ తరలించి కరోనా పరీక్షలు నిర్వహించగా సదరు వ్యక్తికి పాజిటివ్​గా నిర్ధరణ కాగా.. పోలుమల్ల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. అప్రమత్తమైన అధికారులు గ్రామానికి వచ్చిన వ్యక్తి ఎవరెవరిని కలిశాడు? ఎవరితో ఎక్కువగా కాంటాక్ట్​లో ఉన్నాడనే విషయంపై ఆరా తీసే పనిలో పడ్డారు.

ఇదీ చదవండి: 12 రాష్ట్రాల్లోనే 92 శాతం 'వైరస్​' కేసులు

Last Updated :Apr 22, 2020, 1:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.