సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. కళాశాలలో చదువుకునే పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం వరం లాంటిదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విద్యార్థులు కష్టపడి చదవి అన్ని రంగాల్లో రాణించాలని వ్యాఖ్యానించారు. అనంతరం దుబ్బాకలోని ఇంటింటికి తడి చెత్త, పొడి చెత్త బుట్టలను పంపిణీ చేశారు. మున్సిపాలిటీకి కేటాయించిన ట్రాక్టర్లను అందజేశారు.
మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
దుబ్బాకలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ప్రారంభించారు.
![మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే The MLA who started the lunch scheme](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5371207-826-5371207-1576316722153.jpg?imwidth=3840)
సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. కళాశాలలో చదువుకునే పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం వరం లాంటిదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విద్యార్థులు కష్టపడి చదవి అన్ని రంగాల్లో రాణించాలని వ్యాఖ్యానించారు. అనంతరం దుబ్బాకలోని ఇంటింటికి తడి చెత్త, పొడి చెత్త బుట్టలను పంపిణీ చేశారు. మున్సిపాలిటీకి కేటాయించిన ట్రాక్టర్లను అందజేశారు.