ETV Bharat / state

దుబ్బాకలో కరోనా విజృంభణ.. లాక్​డౌన్​ పొడిగింపు!

author img

By

Published : Aug 1, 2020, 7:28 AM IST

సిద్ధిపేట జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి దుబ్బాకలో స్వచ్ఛంద లాక్​డౌన్​ పొడిగించారు. దుబ్బాక పట్టణంలో కొవిడ్-19 కేసులు పెరుగుతున్నందున మండలాధికారులు, స్థానికులు కలిసి.. స్వచ్ఛంద లాక్​డౌన్​ పొడిగిస్తున్నట్టు నిర్ణయం తీసుకొని అమలు చేస్తున్నారు.

Self Lock down   Extended in Dubbaka
దుబ్బాకలో కరోనా విజృంభణ.. లాక్​డౌన్​ పొడిగింపు!

సిద్ధిపేట జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మరోసారి దుబ్బాకలో లాక్​డౌన్ పొడిగించారు. దుబ్బాక పట్టణంలో స్వచ్ఛందంగా ఆగష్టు 1 నుంచి ఆగష్టు 15 వరకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు అన్ని దుకాణాలు తెరుచుకొని 2 గంటల నుంచి మూసివేయాలని పట్టణ వ్యాపార సంఘం, వర్తకులు, వివిధ సంఘాలు, నాయకులు, ప్రజా ప్రతినిధులు నిర్ణయించారు. వైరస్​ను కట్టడి చేసేందుకు దుబ్బాకలో అందరి అభిప్రాయాలు తీసుకొని లాక్​డౌన్​ పొడిగించినట్టు దుబ్బాక ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ చింత రాజు తెలిపారు. ఇంతకు ముందు విధించుకున్న లాక్​డౌన్ కరోనా కేసులు మరిన్ని నమోదవుతున్న నేపథ్యంలో మరో పదిహేను రోజులు పెంచుతున్నట్టు నిర్ణయం తీసుకున్నారు. దీనికి అన్ని వర్తక, వ్యాపార సంఘాలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల వారు ఆమోదం తెలిపారని, కరోనా వైరస్​ను కట్టడి చేయడానికి దుబ్బాక ప్రజలు అందరం కలసికట్టుగా లాక్​డౌన్ పాటించి వైరస్​ వ్యాప్తిని నియంత్రించాలని అన్నారు.

ఇవీ చూడండి: 'రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు రక్షణ లేకుండా పోతోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.