ETV Bharat / state

ప్రిన్సిపల్​ని వెంటనే సస్పెండ్ చేయాలి: విద్యార్థులు

author img

By

Published : Feb 11, 2021, 1:47 PM IST

polytechnic college students allegations on principal at husnabad in siddipet district
ప్రిన్సిపల్​ని వెంటనే సస్పెండ్ చేయాలి: విద్యార్థులు

హుస్నాబాద్​ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ విద్యార్థులు ఆరోపించారు. అంబేడ్కర్ చౌరస్తాలో ఆందోళనకి దిగారు. వెంటనే ఆయనను తొలగించాలని డిమాండ్ చేశారు.

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లోని పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థులు ఆరోపించారు. తమను వేధిస్తున్నాడంటూ నిరసన చేపట్టారు. ప్రిన్సిపల్​కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అంబేడ్కర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. ప్రిన్సిపల్ మద్యం సేవించి కళాశాలకు వచ్చి... తమను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని విద్యార్థులు వాపోయారు.

అవుట్​సోర్సింగ్ మహిళా ఉద్యోగుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ... దుర్భాషలాడుతున్నారని ఆరోపించారు. ప్రిన్సిపల్​ని వెంటనే తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. లేదంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: తొలిసారిగా ఇద్దరు మహిళలకు గ్రేటర్‌ పీఠం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.