ETV Bharat / state

రేపు గజ్వేల్​ నియోజకవర్గంలో పర్యటించనున్న హరీశ్​ రావు

author img

By

Published : Jun 12, 2021, 10:19 PM IST

రేపు గజ్వేల్​ నియోజకవర్గంలో పర్యటించనున్న హరీశ్​ రావు
రేపు గజ్వేల్​ నియోజకవర్గంలో పర్యటించనున్న హరీశ్​ రావు

ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు రేపు సిద్దిపేట జిల్లా గజ్వేల్​ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పలు భవనాలను ప్రారంభించటంతో పాటు మరికొన్నింటికి శంకుస్థాపన చేయనున్నారు.

సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీతోపాటు గజ్వేల్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో మంత్రి హరీశ్​ రావు రేపు పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. గజ్వేల్ మండలం కొడకండ్ల ప్రజలు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న రెండు పడక గదుల ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. గజ్వేల్​లో పరిపాలనా సౌలభ్యం కోసం రూ.7.80 కోట్లతో నూతన మున్సిపాలిటీ భవనాన్ని నిర్మించారు. ఈ భవనాన్ని మంత్రి రేపు ప్రారంభించనున్నారు.

మైనారిటీల సౌకర్యార్థం రూ.3.14 కోట్లతో షాదీఖానా భవనం, ఎక్సైజ్ కార్యాలయం కోసం నూతనంగా నిర్మించిన భవనాన్ని హరీశ్​ ప్రారంభించనున్నారు. వీటితో పాటు గజ్వేల్​లో ఆర్అండ్​బీ అతిథి గృహా నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.

ఇదీ చదవండి: srinivas goud: 'సీఎంపై ఈటల వ్యాఖ్యలు చేయడం సరికాదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.