ETV Bharat / state

నా భూమిని అప్పగించండి.. ఓ మాజీ సైనికుని ఆవేదన

author img

By

Published : Jun 18, 2021, 3:05 PM IST

సిద్దిపేట జిల్లా చేర్యాల పోలీసులు తనపై అక్రమ కేసులు పెడుతున్నారని... వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​లో మాజీ సైనికుడు ఫిర్యాదు చేశారు. తాను కొనుగోలు చేసిన భూమి వ్యవహారంలో తలదూర్చి వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ex-soldier lodged a complaint in state human rights commission
పోలీసులు వేధిస్తున్నారని మానవహక్కుల కమిషన్​లో మాజీసైనికుడి ఫిర్యాదు

తనపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని సిద్దిపేట జిల్లా చేర్యాల పోలీసులపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్​లో ఓ మాజీ సైనికుడు ఫిర్యాదు చేశారు. రాంపూర్ గ్రామానికి చెందిన మాజీ సైనికుడు చంద్ర గౌడ్... తన రిటైర్మెంట్ ద్వారా వచ్చిన డబ్బులతో 2019లో భూమిని కొనుగోలు చేశారు. అది చదును చేసి విత్తనాలు వేస్తుండగా తమ పొలం వద్దకు పోలీసులు వచ్చి అక్రమ కేసులు పెట్టడమే కాకుండా... ట్రాక్టర్​ను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆ భూమి తన పేరు మీద ఉన్నట్లు పాస్ బుక్​ను చూపించినప్పటికీ పట్టించుకోకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. చేర్యాల సిఐ, ఎసైలపై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల కమిషన్​లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తనకు భూమి అమ్మిన దినేశ్​ కుమార్ అనే వ్యక్తితో ప్రాణహాని ఉందని... ప్రభుత్వం తనకు రక్షణ కల్పించాలని కోరారు. మాజీ సైనికుడు చేస్తున్న పోరాటానికి పలు బీసీ సంఘాలు మద్దతు పలికాయి.

ex-soldier lodged a complaint in state human rights commission
పోలీసులు వేధిస్తున్నారని మానవహక్కుల కమిషన్​లో మాజీసైనికుడి ఫిర్యాదు

ఇదీ చదవండి: రేషన్ కార్డు పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిశీలించాలి: మంత్రి గంగుల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.