ETV Bharat / state

దుబ్బాకలో కాంగ్రెస్​ జెండా ఎగురవేస్తాం: ఉత్తమ్​

author img

By

Published : Oct 15, 2020, 5:17 AM IST

About 20 youth  joined the Congress party in the presence of Uttam Kumar Reddy at dubbaka
దుబ్బాకలో కాంగ్రెస్​ జెండా ఎగురవేస్తాం: ఉత్తమ్​

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్​రెడ్డి సమక్షంలో పలువురు యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

కాంగ్రెస్​ బలోపేతం కోసం కృషి చేసి.. పార్టీ అభ్యర్థి ఓటు వేసే విధంగా ప్రచారం చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్​రెడ్డి సూచించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పలువురు యువకులను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో యువకులదే కీలకపాత్ర అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ వేయబోతున్నాడని.. పార్టీ గెలుపే లక్ష్యంగా దుబ్బాకలో కాంగ్రెస్ జెండా ఎగుర వేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: భాగ్యనగరంలో భారీ వర్షాలకు 15మంది బలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.