అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే పల్లె ప్రగతి లక్ష్యం నెరవేరుతుందని పల్లె ప్రగతి రాష్ట్ర స్పెషల్ స్క్వాడ్ యోగితా రాణా అన్నారు. సంగారెడ్డి జిల్లా న్యాలకల్ మండలం హుసెల్లి, శంషేల్లపూర్ గ్రామాలను సందర్శించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో చేపట్టిన పనులను పరిశీలించారు. మురుగు కాలువలు, అంతర్గత దారులు పరిశుభ్రంగా లేకపోవడంపై యోగితా రాణా అసంతృప్తి వ్యక్తం చేశారు.
నాటిన ప్రతి మొక్క బతికేలా.. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పనిచేయాలని సూచించారు. వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డుల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేసి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.
ఇవీచూడండి: 25 రోజుల్లో పల్లెల రూపురేఖలు మారాలి : సీఎం కేసీఆర్