ETV Bharat / state

మంజీరా పైప్​లైన్​ పగిలింది.. దుకాణాల్లోకి నీరు చేరింది

author img

By

Published : Sep 1, 2022, 10:09 AM IST

మంజీరా
మంజీరా

Pipeline burst in Ramachandrapuram: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో మంజీరా పైప్​లైన్​లు రెండుచోట్ల పగిలిపోయాయి. దీంతో నీరు ఉవ్వెత్తున ఎగసిపడింది. భారీగా విరజిమ్మిన నీరు సమీపంలోని దుకాణాల్లోకి వచ్చి చేరింది. సమాచారం అందుకున్న జలమండలి అధికారులు నీటి సరఫరా నిలిపివేయించి మరమ్మతులు చేపట్టారు.

పగిలిన మంజీరా పైప్​లైన్... ఫౌంటెన్​లా ఎగిసిపడ్డ నీరు

Pipeline burst in Ramachandrapuram: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పరిధిలో ఒకేసారి రెండుచోట్ల మంజీరా పైప్​లైన్​లు పగిలిపోయాయి. దీంతో భారీగా తాగునీరు వృథా అయింది. భారీగా విరజిమ్మిన నీరు సమీపంలోని దుకాణాల్లోకి వచ్చి చేరింది. వరద నీటితో దుకాణంలోని వస్తువులు తడిసిపోయాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే లింగంపల్లి కూడలి సమీపంలో పైపులైన్​ పగిలి పెద్ద ఫౌంటెన్​ను తలపించింది. దీనికి తోడు నీరు రహదారిపైకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న జలమండలి అధికారులు వెంటనే నీటి సరఫరా నిలిపివేయించి మరమ్మతులు చేపట్టారు. త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి: అమర జవాన్ల త్యాగం వెలకట్టలేనిది: సీఎం కేసీఆర్‌

తోపుడుబండిపై గర్భిణీ.. కష్టపడి ఆస్పత్రికి తీసుకెళ్తే డాక్టర్, నర్స్ ఆబ్సెంట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.