ETV Bharat / state

సంగారెడ్డిలో పేదలకు అన్నదానం

author img

By

Published : May 5, 2020, 1:40 PM IST

లాక్​డౌన్​ వల్ల ఆకలితో అలమటిస్తున్న పేదలకు సంగారెడ్డిలో అన్నదానం చేశారు. అక్షయ పాత్ర ఫౌండేషన్​ సహకారంతో ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పాత బస్టాండ్​ ఆవరణలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

సంగారెడ్డిలో అన్నదానం
సంగారెడ్డిలో అన్నదానం

సంగారెడ్డిలోని పాత బస్టాండ్​ ఆవరణలో అక్షయ పాత్ర ఫౌండేషన్​ సహకారంతో ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం నిర్వహించారు. లాక్​డౌన్ వల్ల ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న పేదల ఆకలిని తీర్చేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.

32 రోజులుగా ఈ అన్నదానాన్ని చేస్తున్నామన్నారు. లాక్​డౌన్​ను దృష్టిలో ఉంచుకొని మరిన్ని రోజులు ఈ కార్యక్రమం కొనసాగిస్తామని చెప్పారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించి కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: కేసుల సంఖ్య తగ్గించి చెబుతున్నారు: బండి సంజయ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.