ETV Bharat / state

ఇద్దరు దొంగల అరెస్టు.. 20 ద్విచక్ర వాహనాలు స్వాధీనం

author img

By

Published : Oct 15, 2019, 7:39 PM IST

Updated : Oct 15, 2019, 9:07 PM IST

ఇద్దరు దొంగల అరెస్టు.. 20 ద్విచక్ర వాహనాలు స్వాధీనం

జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహన చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 20 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

జల్సాలకు అలవాటు పడి గత సంవత్సర కాలంగా ద్విచక్ర వాహనాలు దొంగతనం చేస్తున్న ఇద్దరు దొంగలను సంగారెడ్డి పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 20 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. ఆందోల్ మండలానికి చెందిన రాము, మల్లికార్జున్​లను పోలీసులు అరెస్టు చేశారు. అమాయకులను ఆసరాగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు డీఎస్పీ తెలిపారు. సంగారెడ్డి స్టేషన్ పరిధిలో 18, రూరల్ పరిధిలో 1, కూకట్ పల్లి పరిధిలో ఒక ద్విచక్రవాహనం దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు. ఇరువురికి గతంలో ఎలాంటి నేరారోపణలు లేవని.. త్వరలోనే కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు స్పష్టం చేశారు.

ఇద్దరు దొంగల అరెస్టు.. 20 ద్విచక్ర వాహనాలు స్వాధీనం

ఇవీ చూడండి: ఫ్యాన్సీ నంబర్లంటూ మోసం...

Intro:TG_SRD_57_15_BIKE_DONGALA_ARREST_AB_TS10057
రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి
( ) జల్సాలకు అలవాటు పడి.. గత సంవత్సర కాలంగా బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను సంగారెడ్డి పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల దగ్గర నుంచి 20బైకులను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. వీళ్ళిద్దరూ ఆందోల్ మండలం ఆందోల్ గ్రామానికి చెందిన రాము(26), మల్లికార్జున్(28) గా గుర్తించామని.. అమాయకులను ఆసరాగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు డీఎస్పీ శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డి స్టేషన్ పరిధిలో 18, రూరల్ పరిధిలో 1, కూకట్ పల్లి పరిధిలో 1 దొంగతనాలు చేసినట్లు తెలిపారు. ఇరువురికి గతంలో ఎలాంటి నేరారోపణలు లేవని.. త్వరలోనే కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు స్పష్టం చేశారు.


Body:బైట్: శ్రీధర్ రెడ్డి, డీఎస్పీ, సంగారెడ్డి


Conclusion:విజువల్, బైట్
Last Updated :Oct 15, 2019, 9:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.