ETV Bharat / state

'ఇంటికో ఉద్యోగం కాదు.. గల్లీకోటి కూడా ఇవ్వలేదు'

author img

By

Published : Jan 13, 2020, 6:24 AM IST

ఇంటికో ఉద్యోగం కాదు.. గల్లీకో ఉద్యోగం కూడా ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజలు తమకు బంగారు తెలంగాణ వద్దు, కనీస సౌకర్యాలు కల్పించాలంటున్నారన్నారు. రంగారెడ్డి జిల్లా మీర్​పేట్ మున్సిపల్ కార్పొరేషన్​ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

colony is not even given a job in telangana
'ఇంటికో ఉద్యోగం కాదు.. గల్లీకోటి కూడా ఇవ్వలేదు'

రంగారెడ్డి జిల్లా మీర్​పేట్ మున్సిపల్ కార్పొరేషన్​లోని లెనిన్​నగర్​ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. తమ నియోజకవర్గం అభివృద్ధి చేస్తామని పార్టీ మారిన నాయకులు ఏం చేశారని ప్రశ్నించారు.

వార్డుల్లో మంచినీరు, రోడ్డు, కరెంటు సమస్యలు అలాగే ఉన్నాయన్నారు. ఎక్కడ చూసినా శిలాఫలకాలు మాత్రమే కనిపిస్తున్నాయని చెప్పారు. తెరాస ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందన్నారు. ప్రజలు తప్పనిసరిగా ఈ పుర ఎన్నికల్లో తెరాసకు బుద్ధి చెప్పాలని కోరారు.

'ఇంటికో ఉద్యోగం కాదు.. గల్లీకోటి కూడా ఇవ్వలేదు'

ఇదీ చూడండి : 'కేటీఆర్ ఆస్తులు 425 శాతం ఏలా పెరిగాయి'

Intro:మలేరియా డెంగ్యూ సమస్యలు ప్రతి ఇంటికి వచ్చేయ్ అని, డ్రైనేజీ మురికి ఎక్కువగా ఉందని తెలిపారు . రంగారెడ్డి జిల్లా మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని లెనిన్ నగర్ లో కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.


Body:కార్పొరేషన్ ఎన్నికలు పెట్టడానికి ప్రధానమైన కారణం ఇంటి టాక్స్ లో కరెంట్ బిల్లు వాటర్ బిల్లులు పెంచడానికి తప్ప మరి దేనికీ అవసరం విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు.


Conclusion:ఈ వార్డులో మంచినీటి సమస్య రోడ్డు సమస్య కరెంటు సమస్య సీసీ కెమెరాలు లేకపోవడం గడిచిన సంవత్సరాలలో తెరాస ప్రభుత్వం లాంటి అభివృద్ధి చేయలేదని కాంగ్రెస్ పార్టీ ఓటు వేసి గెలిపిస్తే సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.