ETV Bharat / state

దేశం గురించి, ప్రజల గురించి ఈ ప్రాంతీయ పార్టీలు ఆలోచించవు : జేపీ నడ్డా

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 19, 2023, 5:27 PM IST

BJP Chief JP Nadda
BJP Chief JP Nadda Attends BJP Public Meeting at Chevella

BJP Chief JP Nadda Attends BJP Public Meeting at Chevella : దేశం గురించి, ప్రజల గురించి ప్రాంతీయ పార్టీలు ఆలోచించవని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఈ తొమ్మిదేళ్ల కాలంలో కేసీఆర్‌ ప్రజల సొమ్మును దోచుకున్నారని విమర్శించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.

BJP Chief JP Nadda Attends BJP Public Meeting at Chevella : ప్రాంతీయ పార్టీల్లో ఎప్పుడూ వారి వారసులే పదవుల్లో ఉంటారని.. వారసులను పదవుల్లో కూర్చోబెట్టడం గురించే ఆలోచిస్తుంటారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) అన్నారు. చేవెళ్లలో జరిగిన బీజేపీ బహిరంగ సభ(BJP Public Meeting)లో పాల్గొన్న ఆయన.. బీఆర్‌ఎస్‌ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

దేశం గురించి, ప్రజల గురించి ఈ ప్రాంతీయ పార్టీలు ఆలోచించవని జేపీ నడ్డా తెలిపారు. ఈ తొమ్మిదేళ్ల కాలంలో కేసీఆర్‌ తెలంగాణ ప్రజల సొమ్మును భారీగా దోచుకున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌(BRS) అంటే భ్రష్టాచార్‌ రాక్షసుల సమితిగా మారిందని విమర్శించారు. కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అవినీతికి పాల్పడ్డారన్నారు. వేలాది మంది బలిదానాల వల్ల తెలంగాణ సాకారమైందని.. వారి బలిదానాలను కేసీఆర్‌ కుటుంబం వృథా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

బీజేపీకి మీరు వేసే ఓటు - తెలంగాణ, దేశ భవిష్యత్తును మారుస్తుంది : అమిత్​ షా

JP Nadda Election Campaign in Telangana : రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఈ పదేళ్ల కాలంలో తన కుటుంబీకులకే పదవులు ఇచ్చి యువతను పూర్తిగా మోసం చేశారని జేపీ నడ్డా ధ్వజమెత్తారు. ఓట్ల కోసం ముస్లిం రిజర్వేషన్లు పెంచి హిందువులకు అన్యాయం చేశారని దుయ్యబట్టారు. రూ.1.20 లక్షల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మించి కమీషన్లు దోచుకున్నారని విమర్శలు గుప్పించారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతి వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చి ఈ తొమ్మిదేళ్లలో ఎంతమందికి రెండుపడక గదుల ఇళ్లు ఇచ్చారో ఆలోచించాలని జేడీ నడ్డా సభకు వచ్చిన ఓటర్లను ప్రశ్నించారు.

BJP Election Campaign at Chevella : మియాపూర్‌ భూముల వేలంలో కేసీఆర్‌ కుటుంబం రూ.4 వేల కోట్లు దోచుకుందని విమర్శించారు. ప్రతి పనిలో కేసీఆర్‌ కుటుంబం 30 శాతం కమీషన్లు తీసుకుంటోందని ఆరోపించారు. దళితబంధులో కూడా బీఆర్‌ఎస్‌ నేతలు కమీషన్లు తీసుకున్నారని పేర్కొన్నారు. మోదీ పాలనలో భారత్‌.. ప్రపంచంలోనే ఐదో ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని బీజేపీ జాతీయ చీఫ్‌ జేపీ నడ్డా గుర్తు చేశారు.

బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో : తెలంగాణ బీజేపీ మేనిఫెస్టోను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా శనివారం విడుదల చేశారు. అందులో అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందేలా.. రూపొందించారు. ధరణి స్థానంలో మీ భూమిను ఏర్పాటు చేస్తామన్నారు. డిగ్రీ చదివే విద్యార్థినులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌ను ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు.

ధరణి స్థానంలో మీ భూమి, వరికి రూ.3100 మద్దతు ధర - 'మన మోదీ గ్యారంటీ - బీజేపీ భరోసా' పేరుతో మేనిఫెస్టో విడుదల

ప్రచారంలో జోరు పెంచిన ప్రతిపక్షాలు - ఒక్క ఛాన్స్ ఇస్తే నిరూపించుకుంటామంటూ ఓటర్లకు అభ్యర్థన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.