ETV Bharat / state

'పురుగులన్నం తినకపోతే టీసీ ఇస్తారట.. మా టీచర్లను అరెస్టు చేయండి'

author img

By

Published : Dec 8, 2022, 10:49 AM IST

Rangareddy
Rangareddy

Viral Video: "సారూ మా పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్నాయి. ఆ పురుగులన్నం తినబుద్దైతలేదు. అయినా అదే తినాలని మా టీచర్లు చెబుతున్నారు. తినకపోతే టీసీ ఇచ్చి ఇంటికి పంపుతరట. అందుకే ఇవాళ స్కూల్​కు పోలే. వాళ్ల మీద కేసు పెట్టడానికి మీ కాడికి వచ్చిన' అంటూ నాలుగో తరగతి చదువుతున్న ఓ చిన్నారి రంగారెడ్డి జిల్లా మీర్​పేట పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన సీఐ మహేందర్ రెడ్డి వెంటనే తమ సిబ్బందిని పాఠశాలకు పంపించారు. అక్కడికి వెళ్లి పరిశీలించగా నిజంగానే కూరగాయలు బాగోలేవని, బియ్యం కూడా మట్టి పట్టి ఉన్నట్లు గుర్తించారు. ఆ చిన్నారి చూపిన ధైర్యాన్ని పోలీసులు అభినందించి పాఠశాల యాజమాన్యంపై చర్యలు చేపట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.