దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఆలయమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. రాజన్నను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం కలగడం పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు.
అతి పవిత్రమైన, శక్తివంతమైన శైవ క్షేత్రం.. శ్రీ రాజరాజేశ్వర దేవాలయం అన్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు దేశం, తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారని తెలిపారు. ప్రజల కష్టాలు తొలగి ప్రశాంతమైన వాతావరణంలో జీవించేలా మహాశివుడు ఆశీస్సులు చూపాలని కోరుకున్నారు.
ఇదీ చూడండి: కనువిందుగా ఐనవోలు మల్లన్న పెద్దపట్నం