సోమవారం నాడు మాసశివరాత్రిని పురస్కరించుకుని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు జరిగాయి. రాత్రి ఆలయంలో మహా లింగార్చన పూజలు ఘనంగా నిర్వహించారు.
స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. అభిషేకాలు, అర్చనల్లో పాల్గొన్నారు. ఆలయ పరిసరాలన్ని శివనామస్మరణతో మారుమోగాయి.
ఇదీ చదవండి: 13 నుంచి ప్రారంభం కానున్న.. క్షీరలింగేశ్వర స్వామి మహోత్సవాలు