ETV Bharat / state

'జీహెచ్ఎంసీ తరహాలో వేతనాలు పెంచాలి'

author img

By

Published : Nov 17, 2020, 3:26 PM IST

Muncipal employess dharna in vemulavada to hike salaries
జీహెచ్ఎంసీ తరహాలో వేతనాలు పెంచాలి: మున్సిపల్​ కార్మికులు

గ్రేటర్​ తరహాలో తమకు వేతనాలు పెంచాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పురపాలక కార్మికులు డిమాండ్ చేశారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.

రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్​ కార్మికుల వేతనాలు పెంచాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పురపాలక కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. జీహెచ్​ఎంసీ తరహాలో జీతాలు పెంచాలని కార్మిక సంఘం నాయకులు డిమాండ్​ చేశారు.

హైదరాబాద్​లో వేతనాలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. అనంతరం పురపాలక కమిషనర్ మట్ట శ్రీనివాసరెడ్డిని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ, మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చూడండి:గ్రేటర్​ పోరుకు కాంగ్రెస్​ సమాయత్తం... రేపటిలోగా అభ్యర్థుల ఖరారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.