ETV Bharat / state

బాలికలను వేధిస్తే ఎవరైనా ఒకటే: మంత్రి కేటీఆర్​

author img

By

Published : Feb 20, 2020, 5:54 PM IST

బాలికలను వేధిస్తే ఎవరైనా ఒకటే: మంత్రి కేటీఆర్​
బాలికలను వేధిస్తే ఎవరైనా ఒకటే: మంత్రి కేటీఆర్​

సిరిసిల్లలోని ఎస్సీ వసతి గృహంలో బాలికలను వేధించిన దేవయ్యపై కఠిన చర్యలు తీసుకున్నామని మంత్రి కేటీఆర్​ వెల్లడించారు. అలాగే తమ నాయకులను సస్పెండ్​ చేశామని తెలిపారు.

బాలికలను వేధిస్తే ఎవరైనా ఒకటే: మంత్రి కేటీఆర్​

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్సీ వసతి గృహంలో బాలికలను వేధింపులకు గురిచేసిన తమ నాయకులను సస్పెండ్​ చేశామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ స్పష్టం చేశారు. తమ పార్టీకి చెందిన దేవయ్యపై కఠిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇవాళ మంత్రి రాజన్న సిరిసిల్లలో పర్యటించారు. అనంతరం ఎస్సీ బాలికల వసతిగృహాన్ని సందర్శించారు.

ఇలాంటి దురాగతాలపై అమ్మాయిలు గొంతెత్తాలని కేటీఆర్​ సూచించారు. వసతి గృహాల్లో ఆత్మరక్షణ కోసం శిక్షణ శిబిరాన్ని చేపడతామని ఆయన పేర్కొన్నారు. ఇలాంటివి మరెక్కడా పునరావృతం కాకుడదని మంత్రి ఆకాంక్షించారు.

ఇవీ చూడండి: మహాశివరాత్రి స్పెషల్: వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.