ETV Bharat / state

కవయిత్రి రాజేశ్వరికి రవాణాశాఖ అధికారుల అభినందనలు

author img

By

Published : Nov 13, 2020, 3:11 AM IST

దివ్యాంగ కవయిత్రి రాజేశ్వరికి రవాణాశాఖ అధికారుల అభినందనలు
దివ్యాంగ కవయిత్రి రాజేశ్వరికి రవాణాశాఖ అధికారుల అభినందనలు

రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రానికి చెందిన దివ్యాంగ కవయిత్రి బూర రాజేశ్వరిని ఉమ్మడి కరీంనగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్​పోర్ట్ కమిషనర్ మామిండ్ల చంద్ర శేఖర్​గౌడ్ అభినందించారు.. ఆత్మ విశ్వాసంతో అంగవైకల్యం జయించడమే కాకుండా సంకల్పబలంతో కవితలు రాస్తూ అందరి మన్ననలు అందుకుంటున్న రాజేశ్వరి.. అందరికీ ఆదర్శమన్నారు.

దివ్యాంగ కవయిత్రి బూర రాజేశ్వరిని ఉమ్మడి కరీంనగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్​పోర్ట్ కమిషనర్ మామిండ్ల చంద్ర శేఖర్​గౌడ్ అభినందించారు. రాజేశ్వరి విషయాన్ని మహరాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియెట్ పాఠ్య పుస్తకంలో పొందుపర్చడం అభినందనీయమని చంద్ర శేఖర్​గౌడ్ అన్నారు.

తన తండ్రిపేరుపై ఏర్పాటు చేసిన స్మారక సాహిత్య వేదిక ద్వారా రాజేశ్వరికి ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా రవాణా శాఖాధికారి కొండల్ రావ్, ఏఎంవీ ప్రమీల తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 'పోలింగ్ కేంద్రాల ముసాయిదా విడుదల'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.